510 కిలోల గంజాయి స్వాధీనం
అక్రమంగా బొలేరో వాహనంలో తరలిస్తున్న 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా చింతపెల్లి నుంచి నర్సీపట్నానికి గంజాయిని తరలిస్తుండగా.. గబ్బాడ గ్రామ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. గంజాయి తరిలస్త్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారూ రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.