చెట్టును ఢీకొన్న బస్సు: ఐదుగురికి గాయాలు


వీరబల్లి: వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ల వనంకాడపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బస్సులోని నలుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావటంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top