రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు


రాజంపేట: వేగంగా వెళ్తున్న స్కార్పియో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో స్కార్పియోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా రాజంపేట మండలం రామాపురం వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలానికి చెందిన క్రిష్ణయ్య కుటుంబ సభ్యులు వాహనంలో తిరుమలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top