పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం
గుంటూరు: గుంటూరు జిల్లా వేమూరులోని పేకాటస్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్బంగా అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు సెల్ఫొన్లు స్వధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.