ఏపీలో 5.04 కోట్ల ఆధార్ కార్డులు జారీ
కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: గత నెలాఖరు నాటికి ఏపీలో 5.04 కోట్లు, తెలంగాణలో 3.78 కోట్ల ఆథార్ కార్డులు జారీ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ డా.కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక జవాబిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ కార్డులు దుర్వినియోగం అయ్యాయని నివేదికలు ఏవీ రాలేదని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పి.పి.చౌదరి తెలిపారు.
ఆధార్ కార్డ్లను ఆన్లైన్లో ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా ధృవీకరించవచ్చునని కేంద్ర మంత్రి చెప్పారు. పలు పథకాలతో ఆధార్ను అనుసంధానం చేసే నిర్ణయం ఆ పథకాలను అమలు చేసే సంస్థలు, విభాగాలదేనని కేంద్ర మంత్రి తెలిపారు.