42 సీబీఎస్ఈ పాఠశాలలకు అనుమతిచ్చాం
విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి కుష్వాహా వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకూ కలిపి 2016-17 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 42 సెకండరీ పాఠశాలలకు సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్) అనుమతిని ఇచ్చిందని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు. సీబీఎస్ఈ స్కూళ్ల అనుమతి విషయమై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 31, తెలంగాణలో11 స్కూళ్లకు అఫిలియేషన్ అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు.