పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి


ముద్దనూరు : వైఎస్సార్ జిల్లా ముద్దనూర్ మండలంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కురిసిన అకాల వర్షంతో జన జీవనం స్తంభించింది. గాలివాన తాకిడికి ఆర్‌పీపీ రహదారిపై చెట్లు కూలి పడిపోవటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ మార్గంలోని దాదాపు నలభై వరకు స్తంభాలు కూలటంతో రాత్రి నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది. పిడుగుపాటుకు మండలకేంద్రంలోని శివాలయం వద్ద ఉన్న40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top