40 కేజీల గంజాయి పట్టివేత


విశాఖపట్టణం : అక్రమంగా తరలిస్తున్న 40కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ జిల్లా రోటుగుంట మండలంలో నందివంపు గ్రామం సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు..మండలంలోని బీబీపట్టణం గ్రామానికి చెందిన మాచాడ చిన్నమనాయుడు ఆటోలో 40 కేజీల గంజాయిని వైజాగ్ తరలిస్తున్నాడు.


ఈ క్రమంలో నందివంపు గ్రామం సమీపంలో పోలీసులు ఆటోని అడ్డుకొని తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందుతుడిని అదుపులోకి తీసుకొని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(రోలుగుంట)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top