పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు


బాపట్ల (గుంటూరు జిల్లా) : మద్యం సేవించి అతి వేగంగా కారు నడపడంతో అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పకట్ల గ్రామం సమీపంలో జరిగింది.



విపరీతంగా మద్యం సేవించి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108లో బాపట్ల తరలించారు. నలుగురు అపస్మారకస్థితిలో ఉన్నట్లు సమాచారం. కాగా గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top