ఆర్టీసీ బస్సు, కారు ఢీ: నలుగురికి గాయాలు


చింతపల్లి : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పసర్లపల్లి వద్ద హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వారిగా గుర్తించారు. కారులో చింతపల్లి నుంచి మాచర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు పరామర్శించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top