రెండు బైక్‌లు ఢీ, నలుగురికి గాయాలు


డీ హీరేళాల్: అనంతపురం జిల్లా డీ హీరేళాల్ మండలం బాలనహళ్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ధనుష్, సుస్మిత (9) అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, ఆంజనేయులు, లక్మీలకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురిని బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top