వడ దెబ్బకు 39మంది మృతి


సాక్షి నెట్‌వర్‌‌క : జిల్లాలో వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి.   ఎండల తీవ్రతకు వృద్ధులు,వ్యవసాయ కూలీలు మృతి చెందుతున్నారు. జిల్లాలో బుధవారం 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మొత్తం 39 మంది మృతి చెందారు. తాడేపల్లి పట్టణ పరిధి డోలాస్‌నగర్‌కు చెందిన పాకల యాకోబు (80),  పెనుమాక గ్రామానికి చెందిన బాణావత్ నాయక్, పిడుగురాళ్ళ మండలం గుత్తికొండకు చెందిన చిలుకూరి రామిరెడ్డి(65), జానపాడు రోడ్డులో ఉన్న దాసరి లక్ష్మమ్మ(60), రెంటచింతల ఆనందపురం ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ముదానమ్మ (78), మోదుగుల వారి బజారులో పల్లెర్ల కాశమ్మ(65), మల్లవరం గ్రామంలో రమావత్ రాముడు నాయక్(35)  మృతి చెందారు.

 

 విజయపురిసౌత్ కు  చెందిన ఇనకొల్లు రాఘవులు (70), మాచర్ల 24వ వార్డులోని వృద్ధురాలు దాసరి భారతమ్మ (72), భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన బుర్రా పోతురాజు(80), తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన పైడిపాటి బాబురావు(48) , పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి చెందిన వాసిమళ్ళ నాగరత్నం (64), సట్టు ముసలయ్య (87) వడ దెబ్బకు మృతి చెందారు. నిజాంపట్నం మండలం కొత్తూరులో చెన్ను నాగరాజు (12), చెరుకుపల్లి మండలం ఆరుంబాక శివారు ఎస్సీ కాలనీలో  వేము మార్తమ్మ (75), వేము వీరాస్వామి (76) మృతి చెందారు.  రేపల్లె  28వ వార్డులో నాలి శ్రీనివాసరావు (45),ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళలో మారాసు రంగారావు(65), చిలకలూరిపేట రూరల్  మండలం తాతపూడిలో శానం సుశీల (65), సత్తెనపల్లి మండలం గుడిపూడిలో వ్యవసాయ కూలీ గుడిపూడి వెంకట్రావు (25),  సత్తెనపల్లి పట్టణం నాలుగో వార్డులో చిరు వ్యాపారి బచ్చు రామారావు (65), ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులో షేక్ జాన్‌బీ(85), నకరికల్లు మండలంలోని చల్లగుండ్లలో గోపు సీతారావమ్మ(60)  వడదెబ్బకు మృతి చెందారు.

 

 కర్లపాలెం మండలం పేరలి కొత్తపాలెంలో అక్కల చిన్నపరెడ్డి(60), కర్లపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ షేక్ వలి(55),  కొత్తనందాయపాలెంలో ఆట్ల రత్నారెడ్డి(50), మేడికొండూరులో ఆకుల ఆంజనేయులు (62), ఏ హనుమాయమ్మ (58) మృతి చెందారు. పెదకాకాని పాతూరు ప్రాంతానికి చెందిన కట్టెవరపు కోటేశ్వరరావు (68), చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో గాదె పుట్లమ్మ(59), వినుకొండ రూరల్ మండలం చాట్రగడ్డపాడులో గాలం సుబ్బులు (70), గుర్రం ఆంజనేయులు (57),  నూజెండ్ల మండలం జంగాలపల్లి ఎస్సీకాలనీలో ఎం.మరియమ్మ(70),ఉప్పలపాడులో బూది పెద్దిరాజులు(55), గాంధీనగరంలో కామిరెడ్డి పిచ్చిరెడ్డి (90) మృతి చెందారు.  బొల్లాపల్లి మండలంలోని మాలపాడులో బాణావత్ మంత్రు నాయక్(65), అచ్చంపేట మండలం  వేల్పూరులో  రావూరి నాగబ్రహ్మాచారి(70), అచ్చంపేటకు చెందిన షేక్ మీరాబీ (72) మృతి చెందారు. చిలకలూరిపేటలో జఖావతు మంగీలీబాయి(85), నాదెండ్ల మండలం జంగాలపల్లెలో ముసుగు వెంకాయమ్మ (60) మృతి చెందారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top