32 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం


రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా నిల్వ ఉంచిన 32 ఎర్ర చందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో శనివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు మండలంలోని పేశెట్టిపల్లె బీట్, చందుగొండ గ్రామాల్లోని పొదల్లో దాచిన ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడిలో పాల్గొన్నారు. దుంగల విలువ రూ.30 లక్షలు ఉంటుందని సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top