30 వేల ఎకరాల్లో రాజధాని రూ. 1.13 లక్షల కోట్లు వ్యయం


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. విజ యవాడ-గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు నివేదికలో పేర్కొంది. 30వేల ఎకరాల్లో నూతన రాజధాని నిర్మాణం చే పట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా మేరకు సచివాలయం, రాజ్‌భవన్‌తోపాటు ప్ర భుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కోసం 1.13 లక్షల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని, ఆ మేరకు ఐదేళ్లలో ఆర్థిక సాయం అందించాల్సిందిగా నివేదికలో పేర్కొన్నట్లు ఓ ఉన్నతాధికారి సాక్షి ప్రతినిధికి తెలిపారు. ఈ నివేదికపై ఆయా రంగాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కేంద్ర ప్రణాళికా సంఘం వచ్చే వారంలో ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 

 రాజధానికి రూట్‌మ్యాప్ ఖరారు?

 

 సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను సిద్ధంచేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అధికారులు ఇందుకు సంబంధిం చిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం పై కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. గుంటూ రు రీజియన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారుల నుంచి కొంత సమాచారం సేకరించారు. అలాగే గ్రామాల వారీగా నిర్వహించిన సర్వే వివరాలను నివేదిక రూపంలో తీసుకున్నారు. రాజ ధానిలో భవనాల నిర్మాణాలకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం. తుళ్లూరు సమీపంలోని వైకుంఠపురంలో రాజ్‌భవన్, తుళ్లూరు-మందడం గ్రామాల మధ్య 49 ఫ్లోర్లతో సచివాలయం నిర్మాణం, అనంతవరం వద్ద అసెంబ్లీ భవనాలు నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు, ఇతర భవనాలను రాజధానికి 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోనే నిర్మించేందు కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top