ఏపీలో 30 లక్షల బోగస్ కార్డులు
హైదరాబాద్ : రాష్ట్రంలో 30 లక్షల బోగస్ కార్డులు ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. బోగస్ కార్డులతో ప్రభుత్వానికి రూ.వెయ్యికోట్లు మేర నష్టం వాటిల్లుతుందని ఆమె అన్నారు.
డీలర్లు అందరూ తమ వద్ద ఉన్న బోగస్ కార్డులను ప్రభుత్వానికి అందచేయాలన్నారు. ప్రతి మండలంలో కిరోసిన్ బంక్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్లు సునీత తెలిపారు. ఈపీఎఫ్వో పథకాలకు గరిష్టంగా 6,500 నుంచి పెంచుతున్నట్లు చెప్పారు.