లారీ, పెళ్లి బస్సు ఢీ: 17మందికి తీవ్ర గాయాలు
కనిగిరి: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలులో వివాహ కార్యక్రమానికి హాజరై తిరి వస్తుండగా కనిగిరిలోని కాశిరెడ్డి కాలనీ సమీపంలో బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొంది. దీంతో సిరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు కాగా బస్సులో ప్రయాణిస్తున్నవారిలో 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ సమయంలో బస్సులో మొత్తం 50మంది ఉన్నారు. వెలిగండ్ల మండలం కంకణంపాడుకు చెందిన పెళ్లి బృందం బస్సులో ఒంగోలు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.