లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురి మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాశ్యం మండలం నలగాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్, బస్సులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్యం కోసం స్థానిక ఆస్సత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని లారీలో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(బంగారుపాళ్యం)