27న విద్యుత్‌ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయసేకరణ


విజయనగరం మున్సిపాలిటీ : 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ చార్జీల పెంపుదలపై ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు  ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ జి.చిరంజీవిరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దాసన్నపేట విద్యుత్‌ భవనం ఆవరణలో ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా రెగ్యులేటరీ కమిషన్‌కు వెల్లడించవచ్చని తెలిపారు.



ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ఎలూరు, గుంటూరు, కర్నూలు, తిరుపతి కేంద్రాల్లో ఈ తరహా కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. విజయనగరంలో మొట్ట మొదటిగా ప్రారంభిస్తామన్నారు. తొలిసారిగా జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యుత్‌ శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రెగ్యులేటరీ కమిషన్‌ రానున్న నేపథ్యంలో విద్యుత్‌ భవనం, పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. కార్యాలయ ఆవరణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top