260 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొప్పెనపూడి గ్రామ సమీపంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున వాహనంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారైయ్యారు. కాగా ముల్లంగి రమణబాబు అనే వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 260 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనంతోపాటు గంజాయిని సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.