25ఎర్రచందనం దుంగలు స్వాధీనం


ఖాజీపేట (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఖాజీపేట బైపాస్ రోడ్డులో శనివారం సాయంత్రం ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న లారీని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రియాంక రెడ్డి బైపాస్ రోడ్డులో కాపు కాశారు. లారీలో తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలను బెంగుళూరుకు తరలిస్తున్నట్లు ఆమె చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top