23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం


బంగారుపాళ్యం : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లి వద్ద సుమోలో అక్రమంగా తరలిస్తున్న 23 ఎర్రచందనం దుంగలను పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. బెంగళూరు వైపు వెళుతున్న సుమోలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు అనుమానించిన ఓ కానిస్టేబుల్ బంగారుపాళ్యం స్టేషన్ సిబ్బందికి సమాచారం అదించారు.



వెంటనే వారు సుమోను వెంబడించి తమ అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారయ్యాడు. వాహనంతోపాటు 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top