స్కూల్ బస్సు బోల్తా: 20 మంది విద్యార్థులకు గాయాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం అంకేపల్లి వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను పొదిలి ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థులకు వైద్యులు ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపించారు. బస్సు డ్రైవర్ అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. దీంతో డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.