స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు
చిత్తూరు: తిరుపతి శివారులో తనపల్లి వద్ద లారీ... స్కూల్ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. అక్కడే ఉన్న ఆటోడ్రైవర్లు వెంటనే స్పందించారు. గాయపడిన విద్యార్థులను వెంటనే తమ ఆటోలలో రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహటిన ఆస్పత్రికి చేరుకున్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.