కలుషిత ఆహారం తిని 20మందికి అస్వస్థత
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుడిబండ మండలం వీరజనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్లో కలుషిత ఆహారం తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో వారికి వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయి.
దాంతో బాధితులను చికిత్స నిమిత్తం మడకశిర ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.