పెళ్లి ట్రాక్టర్ బోల్తా : 20 మందికి గాయాలు


కర్నూలు : కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సంలో గురువారం పెళ్లి వారితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ట్రాక్టర్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top