కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి


రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి దొర్లింది. ప్రమాదవశాత్తు గ్యాలరీ కూలింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రేక్షకులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురికి కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెలుగు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top