మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్లో ఆదివారం ప్రమాదవశాత్తూ ఇద్దరు మృతిచెందారు. ఇంటిని పడగొడుతుండగా మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతిచెందారు. విజయవాడ నగర మేయర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వం అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.