గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరి గల్లంతు
సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. చినకొండెపూడి గ్రామానికి చెందిన వీరబాబు (28), కనక దీపిక (12) భవానీ మాలను తీసుకోవాలని అనుకున్నారు. మాల ధారణ ముందు గోదావరిలో స్నానం చేయాలని అనుకుని శనివారం సాయంత్రం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో దిగారు. ప్రవాహ ఉధృతికి వారిద్దరూ కొట్టుకుపోయారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.