యజమానిని పొడిచి.. 2 కిలోల బంగారం దోపిడీ


చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. 2 కిలోల బంగారంతో పాటు ఐదు లక్షల రూపాయల నగదును కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన యజమానిపై కత్తితో దాడి చేసి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో దుకాణం యజమాని వెంకటేష్కు తీవ్ర గాయాలయ్యాయి.



రాత్రి 12 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి కుప్పం వస్తుండగా ఈ సంఘటన జరిగింది. రైలు దిగి, ఇంటికి నడిచి వెళ్తుండగా దారిమధ్యలో దుండగులు అటకాయించి దుకాణానికి తీసుకెళ్లి, అక్కడ దుకాణం తెరిపించి మరీ దోచుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే, ఆయన చెప్పే వివరాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు అప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయని, వాటి కోసమే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top