సత్యవేడులో 2 కేజీల బంగారం చోరీ


చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని ఓ షాప్ లో దొంగతనం జరిగింది. స్థానికంగా ఉండే మహాలక్ష్మీ పాన్‌బ్రోకర్(వడ్డీవ్యాపారి) షాపులో మంగళవారం రాత్రి 2 కేజీల బంగారాన్నిఎత్తుకెళ్లారు.  దుకాణానికి వెనక వైపు రంధ్రం చేసి  లోపలకి వెళ్లిన దుండగుల 2 కేజీల బంగారాన్ని అపహరించారు. దుకాణ యజమాని రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  క్లూస్‌టీం ఆధారాలను సేకరిస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top