రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
రాజమండ్రి: వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రిలయన్స్ పవర్ పాయింట్ సమీపంలో మంగళవారం జరిగింది. రాజమండ్రి నుంచి కాకినాడకు బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు పవర్ పాయింట్ సమీపంలోకి రాగానే.. కాకినాడ నుంచి సూరంపాడు వెళ్తున్న ఆదిత్య పాఠశాలకు చెందిన బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వారి వివరాలు తెలియరాలేదు.