వడదెబ్బకు ఇద్దరు మృతి
కడప/కర్నూలు: వడదెబ్బకు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం సి.పొలిమేరపాలు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గంగమ్మ (40) మంగళవారం తీవ్ర అస్వస్థతకు లోనైంది, అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది.
కర్నూలు జిల్లా నంద్యాల మండలం పుసులూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీపెద్ద దిబ్బయ్య (52) మంగళవారం పనులకు వెళ్లి అస్వస్థతకు లోనయ్యాడు. రాత్రి ఇంట్లో నింద్రించగా... ఉదయం చూసేసరికి మృతి చెంది ఉన్నాడు.