లారీ, జీపు ఢీ: ఇద్దరు మృతి
సింహాద్రిపురం: వైఎస్సార్జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరగగా ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బజ్జాయిపల్లికి చెందిన ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరమ్మ(45), సింగిశెట్టి భాస్కర్(20)లు మృతిచెందారు. వెంకటేశ్వరమ్మ చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. ఈమెకు భర్త, ఒక కొడుకు ఉన్నారు. భాస్కర్కు జనవరిలో వివాహం కాగా ఆటోలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.