రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శివారులోని ఎస్ మలుపు వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న మేఘనా ట్రావెల్స్కు చెందిన బస్సు రాజమండ్రి నుంచి విజయవాడ వెళుతున్న టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్ చిన్నారావు, అందులో ప్రయాణిస్తున్న అప్పలరాజు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృత దేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.