పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య

పేలుడు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య


కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది.  మృతులలో 14 మంది మహిళలు ఉన్నారు.  ఈ దుర్ఘటనలో నిన్న 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే.  కాకినాడ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ  మరో ఆరుగురు మృతి చెందారు.  మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు.



ఇదిలా ఉండగా,  ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top