వడదెబ్బతో 350 మంది మృతి
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలకు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నారు. వడదెబ్బ ఎక్కడ తగులుతుందోనని భీతిల్లుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం ఒక్కరోజే వడదెబ్బకు 350 మంది చనిపోయారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణాలో 188 మంది మృతి
తెలంగాణా రాష్ట్రంలో వడదెబ్బతో ఆదివారం 188 మంది చనిపోయారు. కరీంనగర్ జిల్లాలో అత్యదికంగా చనిపోగా, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో నూ అధికంగా మృత్యువాత పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో 162 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం వడదెబ్బకు 188 మంది మృతిచెందారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా చనిపోగా, విజయనగరం, కృష్ణా, పశ్చిమగోదావరి, జిల్లాల్లో కూడా అధికంగా మృత్యువాత పడ్డారు.