160 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ఆళ్లగడ్డ (కర్నూలు) : అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 160 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టౌన్లో టీడీపీ నేత వాసుకు చెందిన గోదాములో నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను ఏఎస్పీ శశి కుమార్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసి బియ్యాన్ని సీజ్ చేశారు. గోదాము యాజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.