ధర్మవరంలో 144 సెక్షన్


ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరంలో 144 సెక్షన్ విధించారు. శనివారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు నియోజకవర్గ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని గృహనిర్భందం చేశారు.


దీంతో ఆగ్రహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున అరెస్ట్‌లు చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌కు వామపక్షాలు సంపూర్ణ సహకారం అందించాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top