బిషప్ కిడ్నాప్ కేసులో 14 మంది అరెస్ట్
కడప: వైఎస్ఆర్ జిల్లా కడపకు చెందిన బిషప్ ప్రసాద్ను కిడ్నాప్చేసి చితకబాదిన కేసులో జమ్మలమడుగులోని డాడీ హోమ్ చైర్మన్ రాజారెడ్డి సహా 14 మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత నెల 25వ తేదీన బిషప్ ప్రసాద్ను ఈ 14 మంది కిడ్నాప్ చేసి శారీరకంగా హింసించి మైదుకూరు -చాగలమర్రి రోడ్డులో పడేసిన విషయం తెలిసిందే. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. సోమవారం మధ్యాహ్నం 14 మందిని అరెస్ట్చేసినట్లు ఎస్పీ గులాటీ మీడియా సమావేశంలో తెలిపారు.