పింగళి జయంతిని పురస్కరించుకొని భారీ ర్యాలీ


విశాఖపట్నం :  భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 138వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం విశాఖపట్నంలో 138 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లో స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 138 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top