'జేసీబీలతో అక్రమ లేఅవుట్ల ధ్వంసం'

'జేసీబీలతో అక్రమ లేఅవుట్ల ధ్వంసం' - Sakshi


గుంటూరు: రాజధాని ప్రాంతంలో 261 ఎకరాల్లో 130 అక్రమ లేఅవుట్లు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అక్రమ లేఅవుట్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.



తుళ్లూరులో అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అక్రమ లేవుట్లను శనివారం ఉదయం 10 గంటలల్లా 25 జేసీబీలతో ధ్వంసం చేస్తామని ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top