'మంత్రి హామీతోనే.. గుడిసెలు తొలిగించారు'
అనంతపురం: ఇళ్లకు పట్టాలిస్తామని మంత్రి పరిటాల సునీత ఆ పేదలకు హామీ ఇచ్చారు. కానీ అధికారులు మాత్రం ఆ పేదవాళ్ల గుడిసెలను నేల కూల్చారు. వివరాలు.. రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి అనంతపురం శివారులోని ప్రభుత్వ భూమిలో ఉన్న దాదాపు 130 గుడిసెలను శుక్రవారం ఉదయం నేలమట్టం చేశారు. దీంతో వారికి ఉండేందుకు నీడ లేక రోడ్డున పడ్డారు. దీంతో వారు మంత్రి పరిటా సునీత హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. మంత్రి సునీత తమకు న్యాయం చేయాలని వారుర కోరారు.
సంబంధిత వార్తలు