తిరుపతి ఉపఎన్నిక బరిలో 13 మంది


తిరుపతి: తిరుపతి ఉపఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు శుక్రవారం మధ్యాహ్నంతో ముగిసింది. పదిమంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బరిలో 13 మంది మిగిలారు. టీడీపీ, కాంగ్రెస్, లోక్ సత్తాతో పాటు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడనున్నారు. ఫిబ్రవరి 13 న ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 16 న ఫలితాలు వెలువడతాయి.



మొత్తం 31 మంది ఈ ఉప ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో 8 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో 23 మంది మిగిలారు. అయితే శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసేసరికి 10 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు.  సభ్యుడు మరణించడంతో ఖాళీ అయిన చోట పోటీ పెట్టకూడదన్న సంప్రదాయానికి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో పోటీ చేయని విషయం తెలిసిందే.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top