మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్

మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్


అనంతపురం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పోలీసులు గత అర్థరాత్రి పలు నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోనులతోపాటు రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు కల్యాణదుర్గం పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దాడులు నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top