ఆర్టీసీ బస్ బ్రేకులు ఫెయిలయ్యి..


కర్నూలు : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హంద్రి కైరవాడి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వటంతో ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌లతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో రోడ్డు పక్కనున్న ఓ చిన్న షాపు కూడా ధ్వంసమయ్యింది. కాగా ఆ ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరు డిపోకు చెందినది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top