ఇటు తల్లి మృతి...అటు10వ తరగతి పరీక్ష
గోపవరం: తెల్లవారితే10వ తరగతి పరీక్ష... అంతలో తల్లీ మృతి చెందింది. దీంతో 10వ తరగతి విద్యార్థి వసంత తీవ్ర దుఖంలో మునిగిపోయింది. అమ్మా.... నువ్వు బాగా చదువుకోవాలమ్మా.. అంటూ అమ్మ ఎప్పుడూ చెప్పేదని.. ఆ మాటలు పదేపదే పలువరిస్తుంది. అమ్మ మాట నిలబెట్టేందుకు పరీక్ష రాస్తానంటూ ఆ బాలిక పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి గురువారం పరీక్షకు హాజరైంది.
వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం నీరుబ్దుల్లాయపల్లె గ్రామానికి చెందిన వెంకటమ్మ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. ఆమె కుమార్తె వసంతం స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.