శ్రీవారి దర్శనానికి 10 గంటలు


సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 59,819 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంటలు, కాలిబాటలో నడిచి వచ్చిన భక్తులకు 7 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. రద్దీ వల్ల గదుల కోసం రిసెప్షన్ కేంద్రాల వద్ద భ క్తులు నిరీక్షించక తప్పలేదు. తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు క్యూ కట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top