హుద్-హుద్ బాధితులకు 10 వేల ఇళ్లు
హైదరాబాద్: ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం కింద హుద్హుద్ బాధితులకు 10 వేల ఇళ్లు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జీ ప్లస్ మోడల్లో ఇళ్లు నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపింది. అదే విధంగా దాతల విరాళాలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.