బ్రిడ్జి పై నుంచి దూసుకెళ్లిన టిప్పర్


మంగళగిరి: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి రైల్వేట్రాక్‌ పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం కంప చెట్లలో ఇరుక్కోవడంతో డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని డాన్‌బాస్కో పాఠశాల సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. విజయవాడ నుంచి మంగళగిరి వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం బ్రిడ్జ్ వద్దకు రాగానే అదుపుతప్పి 40 అడుగుల కిందకు పడింది. ఆ ప్రాంతంలో కంప చెట్లు ఉండటంతో టిప్పర్ అందులో ఇరుక్కుంది. ఈ ఘటనలో డ్రైవరకు స్వల్ప గాయాలయ్యాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top