రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి


నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు ఎస్‌బీక్యూ ఉప్పు పరిశ్రమ ఎదుట బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతిచెందాడు. వేరే ఊరెళ్లటానికి లారీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు చెన్నైలోని అన్నానగర్‌కు చెందిన బాలమురుగన్(40) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top